ఈ మధ్య ఐ ప్యాక్ సర్వే అంటూ కొంతమంది తమ రాజకీయ పార్టీలకు సంబంధించి హైలెట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పక్క పార్టీలను డి గ్రేడ్ చేసి చూపిస్తున్నారు. పలానా ఐ ప్యాక్ సంస్థ వాళ్లు ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్లు గెలుస్తారని చెప్పారు లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలుస్తారని చెప్పారు అంటూ చెబుతూ అవతల పార్టీ వాళ్ళని తక్కువ చేసి చూపించడం జరుగుతుంది.


వచ్చే ఎన్నికల్లో 35 నుండి 50 అసెంబ్లీ స్థానాల వరకు మాత్రమే   వైసీపీ  పరిమితమై పోతుందని,  అలాగే 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీకి గెలిచే అవకాశం ఉందని మరో రెండిట్లో మరికొంచెం అవకాశం ఉందని ఈ సర్వే చెప్తున్నట్లుగా చూపించుకుంటూ వస్తున్నారు. కర్నూల్ రిపోర్టర్ ద్వారా నడిచే దిశా అనే పేపర్ లో  ఐప్యాక్ వాళ్ళ సర్వే ఇది అని ఈ వివరాలను చెప్పుకుంటూ వస్తున్నారని తెలుస్తుంది.


అయితే ఇదంతా నిజం కాదని సాక్షాత్తు  ఐప్యాక్ సంస్థ వాళ్లే ప్రకటించడం ఇప్పుడు సంచలనాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఐ ప్యాక్ సంస్థ వెల్లడించిన ఫలితాలు అని చెప్పినవేవీ నిజానికి ఐ ప్యాక్ వి కాదు అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక మీడియా వర్గం తమ  సంస్థ పేరుతో ఫేక్ రాజకీయ ఫలితాలను వెల్లడిస్తుందని, నిజానికి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఐ ప్యాక్ తాజాగా ప్రకటించింది.


తమ పేరుతో మీడియా వర్గాల్లో గాని, సోషల్ మీడియా వర్గాల్లో గాని  రిలీజ్ అయిన ఏ సర్వే కూడా తమది కాదని ఆ సంస్థ తాజాగా చెప్పింది. ఇలాంటి వార్తలు  నిరాధారితమైనవని, మేము ఇప్పటివరకు ఎటువంటి సర్వేలను విడుదల చేయలేదని తేల్చి చెప్పింది. ఈ లెక్క బట్టి చూస్తే ఈ మధ్య ఒక పార్టీ అధ్యక్షుడు ఈ సంస్థ సర్వే పేరుతో వైసిపి వాళ్లు ఓడిపోబోతున్నారని చెప్పడం కూడా  ఇలాంటిదే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: