ఓ సినిమాలో బాలకృష్ణ చెప్పిన సినీ డైలాగులు టీవీ 5 లో డిబేట్ ప్రెజెంటర్ సాంబశివరావు ఆవేశంగా ఓ చర్చ కార్యక్రమంలో మాట్లాడారు. మీడియా మీద జగన్ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు అనే విషయం చెప్పే క్రమంలో ఈ డైలాగ్ లను సాంబశివరావు తన నోటితో పలికారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా అయితే విమర్శలు చేస్తారో అదేవిధంగా సదరు ఛానెల్ ప్రతినిధి పలకడం, పంచ్ డైలాగులు పేల్చడం సెన్సషనల్ అయ్యింది. '' అదేదో సినిమాలో  బాలకృష్ణ గారు చెప్పారు. ఫలానా అమ్మాయిని రేప్ చేశారు... నో పోలీస్. ఫలానా వారిని కొట్టారు నో పోలీస్. ఫలానా వారిని తన్నారు నో పోలీస్, ఫలానా వారి ఇళ్లు తగలబెట్టారు నో పోలీస్. ఇప్పుడు మాత్రం ఎక్కడ నుంచి వస్తున్నారు అంటే చలపతిరావు గారు అలా చూస్తుండిపోయారు. అప్పుడు నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏంటి ఇలా కూడా ఉంటుందా అనుకున్న ... కానీ ఇప్పుడు అంతకన్నా ఘోరంగా ఉంది'' అంటూ.. సదరు న్యూస్ డిబేట్ ప్రెజంటేర్ సాంబశివరావు చెప్పడం.. జగన్ పై ఉన్న అక్కసుని మొత్తం వెళ్లగక్కుతూ ఆ న్యూస్ లో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

 


అసలు జగన్ ప్రభుత్వంలో ఇంకా మీడియా పై వేధింపులు పెద్దగా ఏమీ చోటు చేసుకోలేదు. అసలు సదరు టీవీ 5  మూర్తిపై కేసులు నమోదు చేసారని చెప్పడమే కానీ అది ఇంకా ధృవీకరించలేదు. కానీ ఆయన అరెస్ట్ అయ్యారు అన్న రేంజ్ లో సదరు ఛానెల్ హడావుడి చేస్తోంది. అయితే ఇటువంటి వేధింపులు కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయా ..? గత ప్రభుత్వంలో చోటు చేసుకోలేదా అంటే ..? ఆ విషయాలను ఏవి సదరు ఛానెల్ ప్రెజంటేర్ గుర్తుచేసుకోవడంలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతోమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే నింద మోపి జైలుపాలు చేశారు. ఎంతోమమందిపై బెదిరంపులకు పాల్పడడం, పోలీసుల ద్వారా బెదిరించడం ఎన్నో జరిగాయి. అవేవి ఇప్పుడు సదరు ఛానెల్ కనీసం గుర్తు చేసుకోవడంలేదు.


 అంతెందుకు సదరు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసుకున్న ఆ ఛానెల్ డెబిట్ రిపోర్టర్ సాంబశివరావు ఓ దశలో సినిమా ఇండ్రస్ట్రీ కి చెందిన ఓ విషయంలో మాట్లాడుతూ, అసభ్య పదజాలం ఉపయోగించడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఒక బాధ్యతగల మీడియా ప్రతినిధిగా ఉన్న సాంబశివరావు ఆ విధంగా ఎలా మాట్లాడుతారని, ఆయన క్షమాపణ చెప్పాలంటూ అప్పట్లో పెద్ద రాద్దాంతమే జరిగింది. అసలు టీడీపీ కి గొంతుకగా పనిచేస్తుందన్న పేరున్న సదరు ఛానెల్ ఇప్పడు ఈ విషయంలోనూ యధాతధంగా రాద్ధాంతం చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: