
రెండో అంశం జనసేన మొన్నటి వరకు రెండున్నరేళ్లు సీఎంగా పవన్ కల్యాణ్ అని భావించినా, ఇప్పుడు జనసేన కార్యకర్తలు నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు. కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టిన జనసేన, టీడీపీని ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వమని ఎలా అడుగుతుందని బయట వినిపిస్తున్న టాక్. అసలు బేరం ఆడే శక్తి కోల్పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైసీపీలో అసంతృప్తులు ఎంతమంది ఉన్నారో వారు ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రా రాజకీయాలు ఒక్కసారిగా టర్నింగ్ తీసుకున్నాయి. మొన్నటి వరకు వైసీపీ కి టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు ఎవరూ దరిదాపుల్లోకి రారని భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన గెలుపు ఊపుతో టీడీపీ నేతలు దూసుకుపోతున్నారు. పొత్తుల విషయంలో ఆచితూచి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
టీడీపీ ఒంటరిగా నిలబడాలని నిర్ణయించుకుంటే వైసీపీని ఓడించగలదా.. జనసేన ఓట్లు చీల్చితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఏంటనే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన ఎత్తుగడలు సాధారణ ఎన్నికల నాటికి అనుసరిస్తే టీడీపీ గెలుపు బాట పట్టవచ్చని తెలుస్తోంది.