క్లాస్ వార్.. ఇది చిన్నోళ్లకి పెద్దవాళ్లకి మధ్య జరిగే వార్ అని జగన్ అన్నారు. అయితే ఈ మాట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తగినట్లుగా తెలుస్తుంది. కానీ ఆ చంద్రబాబు నాయుడు దీనిపై మాట్లాడడానికి కుదరదని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇప్పుడు ఆ లెక్కలు చెప్పుకొస్తారట. దాంతో ఈ విషయంపై మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జంకుతున్నట్లు తెలుస్తుంది.


అయితే ఇప్పటివరకు అధికారం లేని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా మాట్లాడితే బాగుంటుందని అంటున్నారట‌. ఆ లెక్కన చెప్పుకోవాలనుకుంటే ఇప్పటి వరకు అధికారంలోకి రాని, అధికారంలో లేని పార్టీ అయితే జనసేన పార్టీ అని కనిపిస్తుంది. కాబట్టి దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  మాట్లాడాలని అంటున్నారు.  దాంతో పవన్ కళ్యాణ్ తో వాళ్ల ఇంటరాక్షన్ అనేది ఫలించింది అని తెలుస్తుంది.‌


అయితే పవన్ కళ్యాణ్ ఈ క్లాస్ వార్ ని క్యాస్ట్ వార్ అంటూ రివర్స్ అటాక్ చేశారట. ఆయన ఏమన్నారంటే మీ దాంట్లో అందరూ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్లే ఉన్నారా అని అడిగితే అవన్నీ అలాగే ఉంటాయన్నట్లుగా చెప్పుకొస్తున్నారట. అయితే ఈ సందర్భంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ని ఇరుకుని పెట్టడానికి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుందట.


వాటి వివరాల ప్రకారం చంద్రబాబు పాలనలో ఎస్సీ ముఖ్యమంత్రులు ఇద్దరు, జగన్ పాలనలో అయితే ముఖ్య మంత్రులు అయిదుగురు. జగన్ పాలనలో బీసీ మంత్రులు ఎనిమిది మంది. చంద్రబాబు నాయుడు పాలనలో ఈ బీసీమంత్రులు 12 మంది. బాబు పాలన లో బీసీ రాజ్యసభ సభ్యులు ఒక్కరూ లేరు. జగన్ పాలనలో బీసీ రాజ్యసభ సభ్యులు నలుగురు. అయితే ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే జగన్ పాలనలోనే ఎక్కువ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: