సమైక్యాంధ్ర నిరసనల మధ్య జగన్ బయటకు వచ్చారు. ఈ విధంగా కొంతమేర జనాగ్రహాన్ని కాంగ్రెస్ కొంతమేర పక్కదోవ పట్టించింది. ఇప్పుడు చంద్రబాబు విషయంలోను ఇదే జరగుతుంది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితులపై జగన్ ఓ అవగాహనకు వచ్చారు. టీడీపీ కకలావికలం అయింది. సమ్మెకు నామమాత్ర స్పందన లభించిందనే భావనలో జగన్ ఉన్నారు. ఇంకా కొన్ని కేసులు నమోదు చేసి మరొకొన్ని రోజులు జైలులో ఉంచే ప్రయత్నం చేయాలని చూశారు.
కానీ అనూహ్యంగా పవన్ చంద్రబాబుతో రాజమండ్రి జైలులో భేటీ అయి ఇక నుంచి టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయి అని ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో పవన్ కొంత సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళితే ఇది రాజకీయంగా తనకు దెబ్బే అని భావించి అతడిని విడుదల చేయవచ్చు. తద్వారా పవన్ దూకుడును టీడీపీ నియంత్రిస్తుంది. పవన్ మద్దతు కావాలి కానీ అతని సారథ్యంలో పనిచేయడానికి టీడీపీ నేతలు ఆసక్తి చూపరు.
చంద్రబాబుతో భేటీ తర్వాత లోకేశ్, బాలయ్యలు చెరోవైపు ఉండగా పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇది కొంత వరకు జనసేనకు సానుకూలాంశమే. పవన్ వల్ల టీడీపీ, జనసేనకు మైలేజ్ వస్తోందని వైసీపీ భావిస్తే వెంటనే చంద్రబాబును బయటకు తీసుకువచ్చి ఈ అంశాన్ని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. టీడీపీ కూడా పవన్ ను ముందుపెట్టి చంద్రబాబు ని బయటకు తేవాలని చూస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి