
అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బద్వేల్ వైసీపీ వర్గ పోరులో ఆమె ఒంటరి అయ్యారని ప్రచారం జరుగుతోంది. బద్వేల్ నియోజకవర్గం లో ఎంపీ అవినాష్ రెడ్డిని వ్యతిరేకించే టీం దూకుడు పెంచింది. ఇక నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు పై కన్ను వేసిన కొందరు నాయకులు సుధకు వ్యతిరేకంగా యాంటీ ప్రచారం ముమ్మరం చేశారు. సుధ వల్ల నియోజకవర్గంలో ఏమీ జరగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ అధికారం లో ఉన్నప్పుడే ఏం పనులు చేయని ఆమె ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల ఆమె తన గోడు చెప్పుకొనేందుకు తాడేపల్లికి రాగా.. రెండు రోజులు వెయిట్ చేయించారు. అయితే తీవ్ర ఆవేదన కు గురైన ఆమె జగన్ ను కాని .. తాడేపల్లి లో ఉన్న వైసీపీ పెద్దలను కాని కలవకుండానే వెళ్లి పోయారట. జనసేన నుంచి ఆమెకు ఆహ్వానాలు అందుతున్నట్టు లోకల్ టాక్ ఉంది. మరి సుధ పొలిటికల్ గా ఏదేనా యూటర్న్ తీసుకుంటారా ? అన్నది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు