దూరవిద్య
ద్వారా విద్యని అభ్యసించాలని అనుకునే వారు ఎవరైనా సరే “హెచ్ సీయూ” నోటిఫికేషన్ కోసం
ఎదురు చూస్తూ ఉంటారు..అయితే “హెచ్ సీయూ” తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది..హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 'దూరవిద్య' ద్వారా పీజీ డిప్లొమా
కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైనవారు ఈ
కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ డిస్టెన్స్
& విజువల్ లెర్నింగ్' 2018 సంవత్సరానికిగాను ఈ
ప్రవేశాలను చేపట్టనుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో దరఖాస్తు
చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300. ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
కోర్సుల వారిగా వివరాలు
పీజీ డిప్లమో కోర్సులు
విభాగాలు: ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, లైబ్రరీ ఆటోమేషన్ & నెట్వర్కింగ్, సైబర్ లా
& ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, క్రిమినల్ జస్టిస్ & ఫోరెన్సిక్ సైన్స్, గవర్నెన్స్, హ్యూమన్ రైట్స్, ట్రాన్స్లేషన్ స్టడీస్ ఇన్
హిందీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ అనాలిసిస్ & క్వాలిటీ మేనేజ్మెంట్, మెడిసినల్ బోటనీ, టెక్నాలజీ మేనేజ్మెంట్
ఇన్ అగ్రికల్చర్, టెలికాం టెక్నాలజీ & మేనేజ్మెంట్.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.
చివరితేది: ఫిబ్రవరి 28.