జర్నలిజం, సామాన్యుడి గుండె
ఘోషని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన అవకాశం. జర్నలిజం, కుళ్ళుని కలంతో కడిగిపారేయగలిగే మహాద్భుతమైన మార్గం.
ఎంతో మంది సమాజంకోసం ఏదన్నా చేయాలనే తపన ఉన్న వాళ్ళు, అట్టడుగున మగ్గిపోతున్న ఎన్నో వ్యధలని
బయటపెట్టాలనే తపన ఉన్న వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్గం ఈ జర్నలిజం. ఎంతో మంది
జర్నలిజం వృత్తిలోకి వెళ్లాలని అనుకుంటారు.
కానీ అది ఎలా, ఎక్కడి నుంచీ మొదలు పెట్టాలి, ఎలా ప్రజలలోకి వెళ్ళాలి. వార్తల్ని ఎలా సేకరించాలి, విశ్లేషణ ఎలా ఉండాలి. అనే మెళకువలు తెలియాలంటే తప్పకుండా అందుకు తగ్గ పునాది అవసరం. అందుకే జర్నలిజం లో పీజీ డిప్లమో చేసే అవకాశాన్ని కల్పిస్తోంది హైదరాబాద్ లోని రచన జర్నలిజం కళాశాల. రెగ్యులర్ , డిస్టెన్స్ విధానం ద్వారా పీజీ డిప్లమో కోర్సులో ప్రవేశానికి ధరఖాస్తులని ఆహ్వానిస్తోంది.
అర్హత : పీజీ డిప్లమో కోర్సుల కోసం ఏదైనా డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సుల కోసం, పదో తరగతి అర్హత
ధరఖాస్తు విధానం : ఆఫ్ లైన్..
ధరఖాస్తు ఫీజు : రూ .200 డీడీ తీసి రచనా జర్నలిజం కళాశాల పేరు మీద సంభందిత అడ్రస్ కి పంపాలి.
ధరఖాస్తు ఆఖరు తేదీ : ఆగస్టు 30 , 2019
మరిన్ని వివరాలకై : 040-23261335 (or) 9959640797