పసిడి ప్రియులకు ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటివరకు నాలుగు రోజులుగా కిందకు దిగి వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త ఎక్కువగానే పెరిగాయి. ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.ఈరోజు బంగారం ధర నిలకడగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. పసిడి ధర స్థిరంగానే కొనసాగింది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా కిందకు దిగి వచ్చింది.


అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు పైకి కదిలాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఈ బంగారం ధరలు చూస్తే.. మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.48,070 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. దీంతో ధర రూ.44,060 వద్దనే ఉంది.. ఇక వెండి విషయానికొస్తే..బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.300 పడిపోయింది. దీంతో రేటు రూ.73,100కు క్షీణించింది.


పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి పూర్తిగా తగ్గిపోవడంతో వెండి రేట్లు పూర్తిగా తగ్గిపోయింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు చూస్తే..బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1839 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.01 శాతం తగ్గుదలతో 27.57 డాలర్లకు క్షీణించింది.
ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం స్టోర్ లు మొదలగు అంశాలు రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి.ఇక రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: