బంగారం కొనాలని అనుకునేవారికి చేదు వార్త.. బంగారం ధరలు భారీగా పైకి కదిలాయి. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు మార్కెట్ లో మరింత పెరిగాయి. ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. రెండు రోజుల నుంచి ఈ రేట్లు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా పైకి కదిలింది. బంగారం ధర బాట లోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది.


 హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పైపైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి కదిలింది. దీంతో రేటు రూ.45,980 కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.350 పెరుగుదల తో రూ.42,150కు ఎగసింది. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యం లో వెండి ధరలు కూడా పైకి కదిలాయి.


గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన కిలో వెండి ధర మాత్రం ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. ఏకంగా కేజీకి ఏకంగా రూ. 1800 పెరిగింది. దీంతో రేటు రూ.73,200కు ఎగసింది.  వస్తువుల తయారీ.. విక్రయాలు పూర్తిగా తగ్గి పోవడంతో వెండి రేట్లు కిందకు దిగాయి..అంతర్జాతీయ మార్కెట్ ‌లో బంగారం ధర   ఈరోజు ఉరుకులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌ కు 0.04 శాతం పెరుగుదల తో 1723 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 26.18 డాలర్లకు క్షీణించింది.. మొత్తానికి మళ్లీ బంగారం రేట్లు పెరిగేలా ఉన్నాయని అంటున్నారు .. ఏదీ ఏమైనా ఉగాది ముందు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.. మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: