కరోనా కారణంగా చాలామంది ఆక్సిజన్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆహారపదార్ధాలను డైట్ లో తీసుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతో ఆక్సిజన్ లెవెల్స్  పెంపొందించడానికి వీలవుతుంది. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.


1). కమలా పండు:
ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ ను పెంపొందించడానికి ఎంతో సహాయ పడతాయి.

2). స్ట్రాబెర్రీస్:
వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి స్ట్రాబెర్రీస్ బాగా సహాయపడుతాయి. కనుక కరోనా బారినపడిన వారు తప్పక తీసుకోవడం మంచిది.

3). శెనగలు:
 శెనగల లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఆక్సిజన్ లెవెల్స్ ను సరిగ్గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

4). పుచ్చకాయలు :
పుచ్చకాయలు వేసవి కాలంలో మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ ను   పెంపొందించడానికి సహాయపడుతుంది.

5). కివి :
 కివీ లో కూడా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి . ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల కరోనా వైరస్ బారి నుండి రికవరీ అవ్వడానికి ఇది బాగా సహాయపడుతుంది.

6). మామిడి:
మామిడి పండులో విటమిన్ ఎ మరియు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి బాగా సహాయపడుతుంది. ఆక్సిజన్ లెవల్స్ ను కూడా పెంపొందించడానికి మామిడి బాగా సహాయపడుతుంది.

7). ఉసిరి : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్ లెవల్స్ ను పెంపొందించడానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది.

 8).వేయించిన జీలకర్ర:
ఆక్సిజన్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక వేయించిన జీలకర్ర తీసుకోవడం  మంచిది. ( ఇందులోకి ఉప్పు ని వేసుకోకూడదు )


పైన చెప్పిన విధంగా, పాటించడం వల్ల మన శరీరంలోని ఆక్సిజన్ లెవెల్ ను పెంచుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: