ఇక స్త్రీలు కళ్లకు కాటుక పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు కళ్లు దురదలు రావడం ఇంకా అలాగే కళ్లు మండడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఊడుగ పువ్వులను సేకరించి వాటిని కంటి రెప్పలపై ఉంచుకోవడం వల్ల కళ్లు దురదలు రావడం ఇంకా కళ్లు మండడం వంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే ఆస్తమా వ్యాధిని నివారించే గుణం కూడా ఈ ఊడుగ చెట్టుకు ఉంటుంది. ఇక ఈ చెట్టు లేత ఆకులను తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి ఆవు నెయ్యిని కలిపి తీసుకుంటే ఆస్తమా ఈజీగా తగ్గుతుంది. ఊడుగ చెట్టు వేరు బెరడును ఇంకా దోరగా వేయించిన మిరియాలను తీసుకుని మెత్తగా నూరి బఠాణీ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని ఎండబెట్టి బాగా నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే రక్త మొలలు సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇక వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఊడుగ చెట్ల లేత ఆకులను పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ ను నొప్పులపై వేసి మర్దనా చేయడం వల్ల వాతపు నొప్పులు ఈజీగా తగ్గుతాయి.


ఈ చెట్టు వేర్లను ఎండబెట్టి బాగా నిల్వ చేసుకోవాలి.ఇక పాము కాటుకు లేదా తేలు కాటుకు గురి అయినప్పుడు ఈ వేర్లను రెండు లేదా మూడు చొప్పున నోట్లో వేసుకుని నెమ్మదిగా నములుతూ చప్పరిస్తూ ఆ రసాన్ని మింగడం వల్ల పాము కాటుకు ప్రథమ చికిత్సలా కూడా పని చేస్తుంది . ఆ తరువాత వైద్యుడి వద్దకు కూడా తీసుకెళ్లవచ్చు.ఊడుగ కాయలను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కాయలు ఎండిన తరువాత వీటి లోపల ఉండే గింజను తినడం వల్ల కూడా మనకు కూడా మేలు కలుగుతుంది. ఈ గింజకు తేనెను కలిపి తీసుకుంటూ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వేసవి కాలంలోనే ఈ గింజలు మనకు ఎక్కువగా దొరుకుతాయి. కనుక వీటిని సేకరించి నిల్వ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఊడుగ చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: