మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్  చిరంజీవి ఇప్పుడు 151వ సినిమాతోనూ సంచలనాలకు రెడీ అవుతున్నాడు. ఇక తను నటిస్తున్న 151వ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రలో నటిస్తున్నారు.


ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు నిర్మాత అయిన రామ్ చరణ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో బాక్సాపీస్ కి గట్టిపోటీ ఇవ్వాలంటే కచ్ఛితంగా సినిమా బ్రాండ్ ని పెంచుకోవాల్సిందే. అందుకే మూవీకి సంబంధించిన బడ్జెట్ విషయంలో రామ్ చరణ్ ఎక్కడా రాజీ పడటం లేదు.


భారీ బడ్జెట్ తో, ప్రముఖ ఆర్టిస్ట్ లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ హీరోలు, అలాగే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అందుతున్న క్లియర్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటించనున్నారని తెలుస్తుంది.


అలాగే సౌత్ ఇండియన్ స్టార్ హీరో మోహన్ లాల్ సైతం ఈ మూవీలో కొద్ది నిముషాలు పాటు కనిపించనున్నారని అంటున్నారు.  ఇక కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూర్య ఈ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’సినిమా కోసం ఇండస్ట్రీకి సంబందించిన పెద్ద పెద్ద స్టార్లు తరలి వస్తున్నారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: