టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’బ్లాక్ బస్టర్ అయ్యాయి.  అత్తారింటికి దారేది సినిమా అయితే నెల రోజు ముందే నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యింది..ఇక సినిమాపై అందరూ ఆశలు వదులుకున్న సమయంలో రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోని భారీ కలెక్షన్లు రాబట్టింది. అంతే కాదు ఈ సినిమా పవన్ కెరీర్ లో ప్రత్యేకంగా మిగిలిపోవడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.   

ఈ సినిమాను కన్నడంలో కిచ్చా సుదీప్ హీరోగా నటించారు.  నదియా పాత్రలో బాలీవుడ్ ఒకప్పటి అందాల భామ మధుబాల నటించింది.  తాజాగా ఈ సినిమాను తమిళంలో శింబు హీరోగా, ‘వంత రాజవతాన్ వరువేన్’ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి సుందర్. సి దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కథలోని లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా వుంది. 

ఇక టీజర్ చూస్తుంటా కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది..అంతే కాదు బడ్జెట్ కూడా బాగానే వెచ్చించినట్లు కనిపిస్తుంది.  సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది.  అంతే కాదు ‘అత్తారింటికి దారేది’ సినిమాను మక్కీకి మక్కీ దించేసినట్లు అర్థమవుతోంది. సమంత పాత్రలో మేఘా ఆకాష్, ప్రణీత పాత్రలో క్యాథరిన్ ట్రెసా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.

తెలుగులో నదియా పోషించిన పాత్రను తమిళంలో రమ్యకృష్ణ చేయడం విశేషం.   ఈ సినిమాలో లుగు వారికి తెలిసిన నటీనటులే ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  తెలుగు వారికి హీరో శింబు కూడా మంచి పరిచయం ఉన్నవాడు కావడం మరో విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: