బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ళు కష్టపడి చేసిన భారీ సినిమా సాహో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందిస్తుండటంతో ఈ సినిమా భారీ అంచనాలతో ఉంది. అయితే బాగా లేట్ కూడా అవుతుందనే అపవాదు కూడా అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు ప్రేక్షకుల్లో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్ సాహోలో ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ నిండా భారీతనమైతే కనపడుతుంది గానీ..అసలు కంటెంట్ ఏంటనేది కాస్త కూడా అర్థమవటం లేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. దానికి తోడు ఇంతకముందు రిలీజ్ చేసిన దుబాయ్ బ్యాగ్డ్రాప్ లో సన్నివేశాలతోనే టీజర్ రావడం ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచింది.

వాస్తవంగా చెప్పాలంటే సాహో టీజర్ చూసిన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ప్రేక్షకులకు మాత్రం కొన్ని అనుమాలు అలానే ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి స్థాయిని చేరుతుందా అని. అందులోని భారీతనం గురించి అటుంచితే ఈ సినిమామ్యూజిక్ ఇచ్చిందెవరు అని..అంతేకాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా. అయితే ఇది మ్యూజిక్ డైరక్టర్ గిబ్రాన్ అని చాలామంది అనుకున్నారు. కానీ అది గిబ్రాన్ మ్యూజిక్ కాదని తెలుస్తోంది. కేవలం ఈ టీజర్ కోసం ఓ హాలీవుడ్ ప్రీరికార్డెడ్ ఆర్ ఆర్ బిట్ ను యువి క్రియేషన్స్ భారీ మొత్తం రాయల్టీగా చెల్లించి, తెచ్చుకునట్లు  తెలుస్తోంది. ఆ మ్యూజిక్ బిట్ ను గిబ్రాన్ మరికాస్త ఎక్స్ టెండ్ చేసినట్లు సమాచారం..  

రాయల్టీగా పది నుంచి పదిహేను లక్షల భారీ మొత్తం చెల్లించి, ఆర్ ఆర్ బిట్ ను తెచ్చారని, దానిని ఇప్పుడు టీజర్ కు వాడారని తెలుస్తోంది. సినిమాకు ముందుగా అనుకున్న శంకర్ - ఎహసాన్ - లాయ్ ల ట్యూన్లు అంతగా నప్పకపోవడంతో, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరక్టర్ల చేత ఒక్కోపాట చేయించాలని సాహో మేకర్లు నిర్ణయించారు. నేపథ్య సంగీతం మాత్రం గిబ్రాన్ చేస్తాడు. అయితే అక్కడక్కడ వాడే సిగ్నేచర్ ట్యూన్ గా మాత్రం టీజర్ లో వినిపించే మ్యూజిక్ బిట్ వుంటుందని లేటెస్ట్ న్యూస్.  



మరింత సమాచారం తెలుసుకోండి: