'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సమంతకు ఇప్పటివరకు ఎదురులేదు. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత కూడ తన సినిమా కెరియర్ కొనసాగిస్తూ టాప్ హీరోయిన్‌ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత   ‘ఓ బేబి’ తరువాత ఈ సంవత్సరంలో నటించిన ‘జాను’ ఆమెకు చేదు అనుభవాన్ని  మిగిల్చింది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో ఒక కీలకపాత్రలో నటిస్తోంది.


దీనితో పాటు సమంత ఒక రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవరించబోతున్నట్లు కూడ వార్తలు వచ్చాయి. సామాజిక అంశాలపై  స్పందించడమే కాకుండా ‘ప్రత్యూష సపోర్ట్’ అనే ఒక  ఎన్ జి ఓ ను నడుపుతూ అక్కడ బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కావల్సిన వైద్య విద్య ఖర్చులను భరిస్తూ చాల కుటుంబాలకు సాయంగా నిలబడుతూ తన వంతు సహాయం చేస్తోంది. 


లేటెస్ట్ గా  అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఒక సినిమా చేయవలసి ఉంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరగవలసి ఉంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ అంతకు మించిన చిత్రమని  అంటున్నారు.  ఈ మూవీతో పాటు కన్నడమూవీ దియాకు రీమేక్‌ గా నందిని రెడ్డి  దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేస్తుంది అని కూడ వార్తలు వస్తున్నాయి.


అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడ ఎవరికి సమంత అందుబాటులోకి లేకపోవడంతో ఆమెకు ఏమైంది అన్న సందేహాలు పెరిగిపోయాయి. ఈరోజు సమంత సందర్భంగా నాగచైతన్య సొంతంగా ఒక కేక్ ను తయారుచేసాడు. ఈ కేక్ ను నిన్న అర్ధరాత్రి సమంత చేత కట్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫోటోలో సమంత భక్తితో ఆ కేక్ ముందు కూర్చుని దణ్ణం పెట్టుకుంటోoది. ఈ ఫోటోని చైతు షేర్ చేశాడు. అయితే ఫోటోలో సమంత ముఖంలోని భావాలు చూసిన ఆమె అభిమానులు మాత్రం ఆమె త్వరలో తల్లి కాబోతోంది అని వస్తున్న వార్తలకు ఈ ఫోటో బలం చేకూరుస్తోంది అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. ఇంతికి సమంత పెడుతున్న దండాలు చైతన్య కెరియర్ గురించా లేదా తనకు పుట్టబోయే బిడ్డ గురించా అన్నవిషయం రానున్న రోజులలో తేలిపోతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: