వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఇటీవల తన ప్రియుడు సామ్ బాంబేను వివాహమాడిన ఈమె.. అంతలోనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా కోసం పూనమ్.. గోవాలోని క్యానాకోనాకు షూటింగ్కు వెళ్లిన సమయంలో జరిగిందీ ఘటన. బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే భర్త, నిర్మాత సామ్ బాంబేకు గోవా కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని పూనమ్.. తన భర్తపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది.


దీంతో కేసు నమోదు చేసి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కనకొనా విలేజ్ షూటింగ్కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.బుధవారం నుంచి నాలుగురోజుల పాటు పోలీసు స్టేషన్లో రిపోర్టు చేయాలని న్యాయస్థానం సామ్ను ఆదేశించింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరిద్దరూ.. 13 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్త లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ పూనమ్ పాండే.. నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై క్రిమినల్ కేసు పెట్టింది. అతడి వల్ల గత కొద్ది నెలల నుంచి మానసిక క్షోభకు గురవతున్నానని పేర్కొంది. గతంలో పూనమ్.. ఓ మొబైల్ యాప్ కోసం రాజ్ కుంద్రా భాగస్వామిగా ఉన్న ఆర్మ్స్ ప్రైమ్ మీడియాను సంప్రదించింది. అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నుంచి తనకు అదే పనిగా, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పిందీ భామ.


ఆ తర్వాత రాజ్కు సహాయకుడు అయిన సౌరభ్ కుశ్వాను సంప్రదించి, ఈ వేధింపులు ఆపాలని కోరినట్లు పూనమ్ చెప్పింది. అది తగ్గకపోగా, తనకు ఫోన్లు రావడం ఇంకా ఎక్కువయ్యాయని ఫిర్యాదులో పేర్కొందీ భామ. ఈ విషయంపై రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. పూనమ్ తనపై చేసిన ఆరోపణల్ని ఖండించాడు. సదరు కంపెనీలో తన వాటాను ఎప్పుడో అమ్మేశానని అన్నాడు. ఈ ఒప్పందం రద్దయిన తర్వాత పూనమ్తో సౌరభ్ సంప్రదింపులు జరపడం ఆపేశాడని చెప్పాడు

మరింత సమాచారం తెలుసుకోండి: