టాలీవుడ్ అందాల చందమామ  కాజల్ అగర్వాల్  అక్టోబర్ 30న గౌతమ్ ను హిందు సంప్రదాయ ప్రకారం వివాహమాడిన విషయం తెలిసిందే.ముంబైలోని ఒక ఒక ప్రయివేట్ హోటల్ లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చాలా సింపుల్ గా పెళ్లి వేడుకను ముగించారు. ఇక ఆ వేడుకకు సినీ తారలు పెద్దగా హాజరుకాలేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.ఇక కాజల్ పెళ్లి అనంతరం హనీమూన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన ఫొటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి. కాజల్ హనీమూన్ కోసం కోట్లల్లో ఖర్చాయినట్లు అప్పట్లో టాక్ వచ్చింది.

 కానీ ప్రమోషన్ లో భాగంగా మాల్దీవ్స్ హోటల్స్ ఆ సెలబ్రెటీ కపుల్స్ కు ఫ్రీగా హనీమూన్ ట్రిప్ ను ఇచ్చినట్లు మరో టాక్ వచ్చింది.ఇక హనీమూన్ అయిపోగానే కాజల్ మళ్ళీ తన రెగ్యులర్ సినిమా లైఫ్ లోకి వచ్చేసింది. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. అయితే కాజల్ తన భర్తను కూడా సినిమాల్లోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంటీరియర్ బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కు పెద్దగా సినీ ఫీల్డ్ తో టచ్ లేదు. అయితే కాజల్ కు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆమె ద్వారానే సినిమా బిజినెస్ లోకి రనున్నాడట.త్వరలోనే గౌతమ్ కిచ్లు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా ఉంటూ పెద్ద హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. అవసరం అయితే కాజల్ తో చిన్న బడ్జెట్ లోనే లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది

. కాజల్ ఇప్పటికే కిచ్లు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఉంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. మరి కాజల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?? గౌతమ్ ప్లాన్ చేస్తున్న న్యూ ప్రొడక్షన్ హౌజ్ ఫ్యూచర్ లో కాజల్ కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి...ఇక ప్రస్తుతం కాజల్...మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో కథానాయికగా నటిస్తోంది.. ఈ మధ్యే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇటీవలే కాజల్, చిరూ లపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ..దాదాపు 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: