ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక చాలా మంది తమ అభిప్రాయాలని ఇష్టా ఇష్టాల్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తారు. అయితే కొందరు పనిపాట లేనివారు  అయితే సెలబ్రిటీలను అదే పనిగా కెలకడం.. వారి కోపానికి కారణం అవ్వడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా హీరోయిన్ల పై అలాగే యాంకర్ల పై కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్ .. వారిని మనోవేదనకు గురిచేసే విధంగా ఉంటున్నాయి అనడంలో కూడా సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి మానసిక క్షోభనే అనుభవించాను అంటుంది హీరోయిన్ సమీరా రెడ్డి.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాలు చేసిన ఈమె అందరికీ సుపరిచితమే. ఇటీవల సమీరా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను ప్రెగ్నెంట్ గా ఉన్న తరుణంలో ఎదుర్కొన్న మనోవేదన గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “పెళ్ళయ్యాక తల్లిని కావాలనే కోరిక ఉన్నప్పటికీ.. ప్రెగ్నెంట్ అయిన టైములో నాలో వచ్చే మార్పులను నేను తట్టుకోలేకపోయేదాన్ని.

 అందుకు నేను సిద్దపడలేదు కూడా.! కాబట్టి నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు నేనే నచ్చకపోయేదాన్ని. మరోపక్క.. సోషల్ మీడియాలో నా గురించి జనాలు చేసే కామెంట్లు నన్ను మరింత బాధపెట్టేవి. విపరీతమైన కోపం కూడా వచ్చేది.కొందరు నా బాడీ షేమింగ్ గురించి ట్రోల్ చేస్తూ చాలా నీచంగా ప్రవర్తించేవారు. అయితే నేను రెండవ సారి ప్రెగ్నెన్సీ ధరించినప్పుడు అలాంటిది ఏమీ అనిపించలేదు.నేను అమ్మను అవుతున్నాను అనే సంతోషం ముందు అలాంటి ట్రోలింగ్స్ పెద్ద ఇబ్బంది అనిపించడం లేదు.

ఇద్దరు పిల్లలకు తల్లిని కాబట్టి.. మునుపటి రూపంలోకి వచ్చేందుకు టైం పడుతుంది. ఆ విషయం గురించి ప్రస్తుతం నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నా పిల్లల గురించి.. వారి భవిష్యత్తు గురించే నా ఆలోచన అంతా…!” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది  సమీరా రెడ్డి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: