మంచు వారబ్బాయి విష్ణు తొలిసారిగా విష్ణు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తండ్రి మోహన్ బాబు వారసత్వంతో అడుగుపెట్టిన విష్ణు తొలి సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారిగా ఢీ మూవీ తో అతి పెద్ద స్థాయి విజయాన్ని అందుకున్నారు విష్ణు. దివంగత నటుడు శ్రీహరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీనువైట్ల తెరకెక్కించారు. అయితే జెనీలియా ఇందులో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి సినిమాలతో మరొక రెండు భారీ సక్సెస్ లు అందుకున్న విష్ణు ఇటీవల ఆశించిన స్థాయి సక్సెస్ లు లేక కెరీర్ పరంగా కొంత సతమతమవుతున్నారు.

ఇక కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా మోసగాళ్లు. ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఎంతో భారీ ఖర్చుతో విష్ణు నటిస్తూ నిర్మించిన ఈ సినిమాలో ఆయన సోదరి గా కాజల్ అగర్వాల్ నటించారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రాజా రవీంద్ర, నవదీప్, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయి ఫలితం అయితే అందుకోలేకపోయింది. దాదాపుగా రూ. 55 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై హీరో కం నిర్మాత అయిన విష్ణు సహా యూనిట్ మొత్తం ఎంతో ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుతం సినిమాకి అనుకున్న స్థాయి కలెక్షన్స్ రాకపోవడంతో వారు కొంత నిరాశ చెందుతున్నారు అనేది ఇన్నర్ వర్గాల టాక్.

ప్రపంచంలోని అతి పెద్ద స్కామ్ గా పలు అంశాల మేళవింపుగా దర్శకుడు ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ తెరకెక్కించిన విధానం కథనం మాత్రం ఆశించిన స్థాయిలో లేవని మెజారిటీ ప్రేక్షకులు దీనిపై విమర్శలు చేస్తున్నారు. కథనంపై మరింతగా శ్రద్ధ ఉంటే బాగుండేదని సినిమాలో హై టెక్నికల్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు వంటివి ఎంతో బాగున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మోసగాళ్లు సినిమా విష్ణు కెరీర్లో మరొక పరాజయంగా మిగిలిపోయే అవకాశం కనపడుతోందనేది విశ్లేషకులంటున్న మాట.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: