ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా తన ఆకట్టుకునే అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ్ తో పాటు తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో అనేక సినిమాలు చేసిన రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో భారీగా రూపొందుతున్న ఈ సినిమాని శివ తెరకెక్కిస్తుండగా ఈ మూవీ మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు టాక్. ఇక రజినీకాంత్ నటించిన ముత్తు, భాషా, అరుణాచలం, చంద్రముఖి, దళపతి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు పలు సంచలన రికార్డ్స్ అందుకుని ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి.

ఇక రజిని మార్క్ డైలాగ్స్, స్టైల్, ఫైట్స్, యాక్షన్ కి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు అనే చెప్పాలి. ఆ విధంగా రజిని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల వరుసగా మంచి విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్న రజినీకాంత్ కి మన కేంద్రప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అభిమానుల్లో విపరీతమైన ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు రజని కి ఇంతటి గొప్ప అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప అవార్డులు గెలుచుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మెసేజెస్ చేస్తున్నారు.

అయితే రజినీకి ఈ అవార్డు దక్కడంపై టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిన్న తన జనసేన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేసారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ ప్రేక్షకుల తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులని కూడా నటనతో అలరిస్తూ తనకంటూ గొప్ప పేరు సంపాదించిన రజినీకాంత్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్నివిధాలా అర్హులు, అన్నయ్య చిరంజీవి తో కలిసి ఆయన బందిపోటు, కాళీ వంటి సినిమాలు చేయడం తాను ఎప్పటికీ మర్చిపోలేనని, తన కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉందని, రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సినిమాలతో ప్రేక్షకాభిమానులను అలరించాలని కోరుతూ పవన్ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: