వెండితెరపై ఒక వెలుగు  వెలుగుతున్న చాలామంది నటీమణులు అందాల పోటీలలో పాల్గొని వచ్చిన వారే ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా కూడా ఒకరు.1982 జులై 18న జంషెద్ పూర్ లో జన్మించింది ప్రియాంక చోప్రా. ఇక ఈమె తండ్రి, తల్లి కూడా మిలటరీలో పనిచేసేవారు. అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రా తన ఆస్తులను అమ్ముతున్నట్లు సమాచారం. విలువైన వాటిని ఎందుకు అమ్మెస్తోందో   తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా తన మిస్ అందాల పోటీలలో రెండవ స్థానంలో గెలవగా.. దాంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక ఈమె మొదటి సినిమా "Humraaz" . కానీ ఈ సినిమా అవకాశం ఈమెను దరి చేరలేదు. ఇక ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ తో కలిసి తమిళం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించడంతో, తెలుగు సినీ దర్శకులు ఆమె వెంట పడ్డారు.

అలా ఎంతోమంది ఆమె చుట్టూ  తిరిగాక, చివరికి ఒక నిర్మాత నెక్కంటి శ్రీదేవి కి మాత్రం ఆమె డేట్స్ దొరికాయి. ఇక ఈమెతో కలిసి 2002లో"అపురూపం" అనే సినిమాను తీసింది. ఈ సినిమాకీ సాయి రవి దర్శకత్వం వహించాడు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక దాంతో ఆమె హిందీ వైపు మొగ్గు చూపడంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

ప్రియాంక చోప్రా అలా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ఎంతో డబ్బులు వెనక్కి వేస్తూ , పలుచోట్ల కొన్ని ప్రాపర్టీ లను కొనింది.. అందులో మహారాష్ట్ర లో 3 కోట్ల రూపాయలకు ఒక ప్రాపర్టీని ఈ సంవత్సరంలో అమ్మింది. ఇక నాలుగు కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్ ను కూడా కొనింది. ఇక అంతే కాకుండా ప్రియాంక చోప్రా ఆఫీస్ ను కూడా అద్దెకి 2.11 లక్షల రూపాయలకు ప్రకటించింది.

ఈమె పాప్ సింగర్"నిక్ జోనస్" ను వివాహం చేసుకుంది. ఇక ఇదే తరహాలో ఆమె తన ప్రాపర్టీని అమ్ముకుంటూ వస్తోంది. ఇక ఇదంతా తనకు  కొత్తేమీ కాదు. ఇక వీరిరువురు గ్లోబల్ స్టార్ వంటి వాటిలో నివసిస్తున్నారు దీని విలువ దాదాపుగా 150 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈమె ప్రాపర్టీ కి ఎక్కడ ధర ఎక్కువ పలికితే, అక్కడ ప్రాపర్టీని అమ్మడం, కొత్త ప్రాపర్టీని కొనడం లాంటివి చేస్తూ ఉంటుంది ప్రియాంక.


మరింత సమాచారం తెలుసుకోండి: