నటుడిగా, కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్లగణేష్. అలా ఎదుగుతూ వచ్చి , నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించాడు ఈయన. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కు ఒక ప్రత్యేకమైన వీర అభిమాని . పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ కి వెళ్తే అక్కడ గొప్పగా చెబుతూ ఉంటాడు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ హీరోగా త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం.

బండ్ల గణేష్ హీరోగా వెంకట్ చంద్ర దర్శకత్వం లో  తొలి పరిచయం  చేస్తూ.. ఆయన హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారట. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్స్ నంబర్ వన్ గా స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చెబుతూ.."ఈ సినిమాకి హీరోగా బండ్ల గణేష్ అయితేనే సరిపోతుందని, ఆయనని సంప్రదించాలని తెలియజేశారు". దీనికి ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

తమిళంలో పార్థిబన్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ.."ఒత్తు సెరప్పు సైజ్ 7 " మూవీ ని బండ్ల గణేష్ రీమేక్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా పార్థిబన్ స్వీయ దర్శకత్వంలో వచ్చినది. ఇక ఈ సినిమాకు ఎన్నో అవార్డులు తో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమాని ఇదే సంవత్సరంలో సెప్టెంబరు మాసంలో ప్రారంభం చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. అంతేకాకుండా ఈ సినిమాకి అరుణ్ దేవినేని ఛాయాగ్రహాలుగా వ్యవహరిస్తున్నారు

ఇక అంతే కాకుండా ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా ను హిందీలో కూడా అభిషేక్ బచ్చన్  రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి చిత్రీకరణ కూడా చెన్నైలో ప్రారంభమైనట్లు ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాలు ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేస్తుంటే బండ్ల గణేష్ హీరో గా వస్తున్నాడు అనే ఆనందం కూడా అంతే స్థాయిలో కలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: