అసలు అభిషేక్ బచ్చన్  కు ఏమైంది ? అనే చర్చ మొదలైంది సినిమా ఇండస్ట్రీలో. దానికి కారణం ఆయన చేతికి కట్టుతో కన్పించడమే. ఈరోజు అమితాబ్ బచ్చన్, ఆయన సోదరి శ్వేతా నందా ముంబై లీలావతి ఆసుపత్రి బయట కనిపించారు. అప్పటి నుండి అభిమానులు అమితాబ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ తన సారొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని భావించారు. ఇంతలో గాయంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్‌ను చూడటానికి కొంతమంది నటీనటులు అక్కడకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అభిషేక్ బచ్చన్ కు ఈ గాయం ఎలా అయ్యింది? గాయం ఎంత తీవ్రంగా ఉంది ? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం అతడిని ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. ఆ తర్వాత అమితాబ్, శ్వేత ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో అమితాబ్ బచ్చన్ తెల్లటి హూడీ ధరించారు. దీనితో పాటు అతను మాస్క్ కూడా ధరించాడు. ఆయనకు గాయమైన వార్తతో అభిషేక్ అభిమానులు బాధపడ్డారు.

రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. అక్కడ అతను తన భార్య ఐశ్వర్యరాయ్, కుమార్తె ఆరాధ్యను డ్రాప్ చేయడానికి వెళ్లాడు. మణిరత్నం సినిమా 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ కోసం ఐశ్వర్య మధ్యప్రదేశ్‌ లోని ఓర్చాకు వెళ్లింది. ఆ సమయంలో తీసిన పిక్స్ వైరల్ అయ్యాయి. దీనిలో అతను తన కుడి చేతిలో స్లింగ్ ధరించి కనిపించాడు. అతని చేతి వేళ్లలో బ్యాండేజీలు కూడా కట్టబడ్డాయి.

అభిషేక్ వర్క్ విషయానికొస్తే... ఇటీవల ఆయన "ది బిగ్ బుల్" అనే హిందీ భాషా ఫైనాన్షియల్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కూకీ గులాటి దర్శకత్వం వహించారు. దీనిని అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ,  కుమార్ మంగత్ పాఠక్ నిర్మించారు. ప్రస్తుతం ఆయన 'దాస్వి' సినిమా చేస్తున్నాడు. ఇందులో అభిషేక్ పెద్దగా చదువుకొని నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: