తొలిసారిగా టాలీవుడ్ కి నటుడిగా బాబీ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహర్ రమేష్, ఆ తరువాత దర్శకుడిగా మారి ఎన్టీఆర్ తో తీసిన మూవీ కంత్రి. ఫస్ట్ టైం మహేష్ తో బాబీ మూవీలో ఒక చిన్న పాత్ర చేసిన మెహర్ రమేష్, ఆ తరువాత కన్నడలో రెండు సినిమాలు తీసి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక తెలుగులో ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టి ఎన్టీఆర్ తో తీసిన కంత్రి సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్వినిదత్ నిర్మించారు. ఇక దాని తరువాత ప్రభాస్ తో బిల్లా మూవీ తీసి మంచి విజయం అందుకున్న మెహర్ రమేష్ ఆపై ఎన్టీఆర్ తో మరొక్కసారి తీసిన సినిమా శక్తి, కాగా ఈ మూవీ కూడా ఫెయిల్ అయింది.
ఆ తరువాత వెంకటేష్ తో ఆయన తెరకెక్కించిన షాడో కూడా ఫ్లాప్ కావడంతో కెరీర్ పరంగా కొంత బ్రేక్ తీస్తున్న మెహర్ రమేష్, కొన్నేళ్ల గ్యాప్ తరువాత త్వరలో మెగాస్టార్ తో భోళా శంకర్ మూవీ తీయనున్నారు. తమిళ్ లో అజితే హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన వేదాళం అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలిగా నటిస్తుండగా అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, మెగాస్టార్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ లతో తన నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేస్తున్న మెహర్ రమేష్, ఇప్పటికే వారి కోసం రెండు పవర్ఫుల్ స్టోరీలు సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో కథలు పూర్తి చేసి వారిద్దరికీ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకోనున్నారట మెహర్ రమేష్. కాగా తన కెరీర్లో వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన మెహర్ రమేష్ మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ లతో ఎటువంటి రిజల్ట్ ని ఇచ్చే సినిమాలు తీస్తారో అని ఆయా హీరోల ఫ్యాన్స్ లో ఇప్పటి నుండే కొంత భయం నెలకొన్నట్లు టాక్. అయితే మెహర్ రమేష్ తన తో చేస్తున్న సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టడం, మళ్ళి మంచి ఫామ్ లోకి రావడం ఖాయం అని, తనలోని పట్టుదల నాకు తెలుసు అంటూ ఇటీవల ఒక సందర్భంలో మెగాస్టార్ చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ, నిజంగానే మహేష్, పవన్ లతో మెహర్ సినిమాలు చేస్తారో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.    

మరింత సమాచారం తెలుసుకోండి: