తెలుగు విలక్షణ దర్శకులలో ఒకరైన క్రిష్ జాగర్లమూడి, శర్వానంద్, అల్లరి నరేష్ హీరోలుగా తెరకెక్కిన గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు, ఆ తర్వాత వేదం,  కృష్ణం వందే జగద్గురం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలు మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ అంగీకారంతో ఆ సినిమాను ఆపి,  పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించాడు,  ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కించాడు.

 కొండపొలం సినిమాతో క్రిష్ జాగర్లమూడి  విమర్శకుల ప్రశంసలను పొందాడు.  ఇది ఇలా ఉంటే ఈ సారి క్రిష్ జాగర్లమూడి ప్రముఖ ఓటిటి సోనీ లివ్ కోసం మరొక అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి క్రిష్ జాగర్లమూడి,  గురజాడ అప్పారావు ఫేమస్ నాటకం ఆయన కన్యాశుల్కం పై ఇంట్రెస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది,  తెలుగు సాహిత్య చరిత్రలో ఈ నాటకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో వేదికలపై నాటకం గాను, అలాగే సినిమా గాను అలరించిన కన్యాశుల్కం ను వెబ్ సిరీస్  ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేస్తున్నట్టు తెలుస్తోంది,  అయితే ఈ వెబ్ సిరీస్ కు క్రిష్ జాగర్లమూడి రచన మరియు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేయనున్నట్లు ఒక టాక్ నడుస్తుంది, ఇలా క్రిష్ జాగర్లమూడి కన్యాశుల్కం లాంటి అదిరిపోయే కథ పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: