కర్ణాటక రాష్ట్రాన్ని మొత్తం బాగా ఊపేస్తున్న వివాదం 'హిజాబ్' ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విస్తరించింది. దీనిపై రెండు వర్గాలు విమర్శలు ప్రతి విమర్శలతో తెగ హోరెత్తిస్తున్నాయి.కర్ణాటక రాష్ట్రంలో అయితే కళాశాలలకు సెలవులు ప్రకటించే వరకూ వెళ్లింది. హైకోర్టుకు కూడా చేరింది.ముస్లిం ఆడవాళ్లు హిజాబ్ (తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కు కాలేజీలకు రావాలని అక్కడి వారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్టులో విచారణ అనేది సాగుతోంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమదైన రీతిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.ఇక తాజాగా బాలీవుడ్ వివాదాస్పద నటి స్వర భాస్కర్ కూడా హిజాబ్ వివాదంపై స్పందించింది.
 

మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి ఆమె గురైంది. ' ఈ హిజాబ్ వివాదం వింటుంటే మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ వివాదాస్పద కామెంట్స్ చేసింది.'ఇక మహాభారతంలో ద్రౌపదికి బలవంతంగా వస్త్రాపహరణం గురించి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది గొప్పవారు బలవంతులు ఆపగలిగిన వారు ఉన్నా కాని ఆ ఘటనను అలా చూస్తుండిపోయారు. ఇక అది మళ్లీ ఇప్పుడు గుర్తొచ్చింది' అంటూ స్వరభాస్కర్ వివాదాస్పద కామెంట్స్ చేసింది.ఇక దీనిపై నెటిజన్లు భగ్గుమన్నారు.సిగ్గు లేకుండా బికినీలు వేసుకొని తిరిగే  నువ్వు హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావా? అని కొందరు మండిపడ్డారు.


 హిందూ మతం గురించి మాట్లాడుతూ ఇస్లాం మతాన్ని నిరాకరిస్తోందని పాపం ఆమెను చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఒళ్ళు తెలీకుండా అన్ని విప్పి చూపించే నువ్వు సంప్రదాయాలు గురించి మాట్లాడుతున్నావా అంటూ చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే గాక బూతు సినిమాలు చేస్తూ యూత్ ని చెడగొట్టే మీ లాంటి వాళ్ళు ఎదుటి వాళ్లకు ఆపద వస్తే స్పందించరు కాని అనవసరమైన విషయాల్లో తల దూరుస్తూ తిట్లతో పరువు పోగుట్టుకుంటారు అంటూ ఆమెని తెగ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: