అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమాతో  తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.  సోనాలి బింద్రే తెలుగు లో నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, మురారి సినిమాలో తన నటన తో, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను సోనాలి బింద్రే ఫిదా చేసింది,  ఇలా మొదటి సినిమా మురారి తోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సోనాలి బింద్రే కు ఆ తర్వాత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

  సోనాలి బింద్రే అందులో భాగంగా ఖడ్గం, ఇంద్ర ,  మన్మధుడు లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది,  90 లలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన సోనాలి బింద్రే ఆ సమయం లో తన అందచందా లతో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది, ఆతర్వాత సోనాలి బింద్రే వివాహం చేసుకొని  సినిమాలకు దూరంగా ఉంది.  ఆ తర్వాత సోనాలి బింద్రే టీవీ రంగం లోకి వెళ్ళింది,  కొన్నాళ్ళ క్రితం సోనాలి బింద్రే క్యాన్సర్‌ బారిన పడింది, అమెరికా లోని న్యూయార్క్‌ లో చికిత్స తీసుకొని సోనాలి బింద్రే కోలుకుంది.  ఇది ఇలా ఉంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్క బోతున్న సినిమాలో సోనాలి బింద్రే ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.  పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాకు సోనాలి బింద్రే కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది,  ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: