సౌత్ ఇండియా స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పీరియడికల్ మూవీ 'హరి హర వీరమల్లు' సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని కూడా కేటాయించారాయన. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోవిడ్ కి ముందు మొదలైంది. కానీ ఇప్పటికీ మిగతా సినిమాలు పూర్తయి రిలీజ్ అయి పాతబడిపోయినా ఈ మూవీ షూటింగ్ కి మాత్రం అసలు మోక్షం లభించడం లేదు.ఇక గతంలో 15 రోజులు షూటింగ్ చేశారు. ఆ తరువాత కరోనా స్టార్ట్ కావడంతో అన్ని సినిమాల తరహాలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఏప్రిల్ 5 వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు 5 నెలలు పవన్ కేటాయిస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి. దీంతో పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో మరో సారి కొత్తగా సెట్ లని కూడా నిర్మించారు. కానీ పవన్ కల్యాణ్ సెట్ లోకి రాకపోవడంతో మంగళవారం నాడు షూటింగ్ కాస్తా మరోసారి పోస్ట్ పోన్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.



ఈ మంగళ వారం నాడు పోస్ట్ పోన్ అయిన షూటింగ్ మళ్లీ మొదలవుతుందా? లేదా మళ్లీ బ్రేకిస్తుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలనే పట్టుదలతో ఈ భారీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు ఎ.ఎం.రత్నం. కానీ వరుస బ్రేక్ లు పడుతుండటంతో ఆయన కల నెరవేరేదెప్పుడని ఓ చర్చ నడుస్తోందిట.ఇక నిర్మాత పరిస్థితి ఇలా వుంటే దర్శకుడు క్రిష్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చే నడుస్తోంది. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయించిన క్రిష్ దీంతో దర్శకుడిగా తన సత్తాని చాటుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలకపోవడంతో క్రిష్ పరిస్థితి ఏంటా? అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారట.ఇవన్నీ తెలిసి కూడా దర్శకుడు ఏమీ చేయలేక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. ఈ నెల నుంచి అయినా 'హరి హర వీరమల్లు' సినిమా పట్టాలెక్కాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: