ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ఆసక్థిగా ఎదురు చుస్తున్నారు రవితేజ అభిమానులు.. కాగా, ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని ఫస్ట సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బుల్ బుల్ తరంగ్ అంటూ సాగే ఈ మెలోడీని సిద్ శ్రీరామ్ పాడడంతో పాటకి మంచి హైప్ ను క్రియేట్ చేసింది.
రజీషాపై రవితేజకు ఉన్న ప్రేమనంతా తన లిరిక్స్తో తెలియజేశాడు. మొత్తానికి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. రవితేజ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి మొదలగు వాళ్ళు సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.సామ్.సిఎస్ సంగీతం అందిస్తుండగా, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.జూన్ 17న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా అన్నా రవితేజకు హిట్ ను ఇస్తుందెమో చూడాలి..