యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ,18 పేజీస్ వంటి చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇందులో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది అన్న సంగతి అందరికీ తెలిసినదే.. కమర్షియల్ సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకుని నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించడం జరుగుతోంది. ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో ని నటుడైనా అనుపమ్ ఖేర్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించడం జరిగింది చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం జూలై 22న విడుదల చేయడానికి సిద్ధమైంది చిత్రబృందం. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు హీరో నిఖిల్. ఇక కార్తికేయ చిత్రం సీక్రెట్ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి.. సామాన్య ప్రేక్షకులలో, సినీ ప్రముఖులు కాస్త ఆసక్తి నెలకొని ఉందని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్లలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది..

అదేమిటంటే ఈ పోస్టర్ లో డాక్టర్ కార్తికేయ ప్రయాణం శ్రీకృష్ణుడి చరిత్రకి సంబంధించిన ద్వారక యుగంలో జరిగినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడి చరిత్రకు సంబంధించిన వాటిని వెతికే వాటి ఆధారంగా ఈ చిత్ర కథను తెరకెక్కించడం జరిగినట్లుగా సమాచారం. అయితే కార్తికేయ కు, శ్రీకృష్ణ ద్వారకా కు గల సంబంధం ఏమిటి అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక కార్తికేయ మొదటి భాగంలో కలర్స్ స్వాతి జంటగా నటించారు. మరి ఇప్పుడు కూడా అలాగే నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: