టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆర్ సీ 15వ సినిమాగా మెగా అభిమానుల ముందుకు రాబోతుందీ చిత్రం.ఇక ఇప్పటికే సెట్స్ కి వెళ్లిన సినిమా కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. హైదరాబాద్ ఇంకా రాజమండ్రి లో కీలక షెడ్యూల్స్ పూర్తిచేసారు. వాటిపై రామ్ చరణ్ సహా కీలక నటీనటులపై సీన్స్ ని షూట్ చేశారు.అలాగే రాజమండ్రి షెడ్యూల్ షూట్ లో హీరోయిన్ కియారా అద్వాణీ కూడా పాల్గొంది. రామ్ చరణ్ ఇంకా కియారాలపై శంకర్ కొన్ని సీన్స్ పూర్తి చేసారు. అటు పై రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రిలీజ్ దగ్గరకి రావడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. కొద్ది రోజుల పాటు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రచారంలోనే బిజీ అయ్యారు. మార్చి 25 వ తేదీన'ఆర్ ఆర్ ఆర్' సినిమా రిలీజ్ అవ్వడంతో రామ్ చరణ్ ఫ్రీ అయిపోయారు. అటుపై సక్సెస్ పార్టీలు కూడా రామ్ చరణ్ పూర్తి చేసేసాడు.దీంతో రామ్ చరణ్ మళ్లీ ఆర్ ఈసీ 15 సినిమా షూటింగ్లో బిజీ అయినట్లు సమాచారం తెలుస్తోంది.



తాజాగా ఆన్ సెట్స్ నుంచి హీరోయిన్ కియారా ఫోటో ఒకటి లీకైంది. ఈ ఫొటోలో కియారా వంగపువ్వు రంగు పంజాబీ డ్రెస్... ఇంకా మెడలో మ్యాచింగ్ చున్నీ ధరించి నవ్వుతూ కెమారాకి ఫోజులిచ్చి కనిపిస్తుంది.ఇక కియారా చేతుల్లో రామ్ చరణ్ కి ఎంతో ఇష్టమైన పప్పీ రైమ్ కూడా ఉంది. కియారా కాసేపు రైమ్ తో టైంపాస్ చేసినట్లు చూస్తుంటే తెలుస్తుంది.కియారాకి కూడా పప్పీలు అంటే చాలా ఇష్టం. తన ఇంట్లో ఖాళీ సమయాన్ని ఎక్కువగా వాటితోనే గడుపుతుంది. అదే ఉత్సాహం 'ఆర్ సీ 15' సెట్స్ లో కూడా కనిపిస్తుంది. రామ్ చరణ్ రైమ్ కనిపించగానే దగ్గరకు చేతుల్లోకి తీసుకుని కౌగిలిచించుకుంది. ఇక రామ్ చరణ్ కి రైమ్ అంటే ప్రాణంతో సమానం. రామ్ చరణ్ ఇంట్లో ధోనీ ఇంట్లో తరహాలోనే పెంపుడు జంతువులు ఎక్కువగానే ఉంటాయి.అందులో రైమ్ వయసు కూడా చాలా చిన్నది. దీంతో రామ్ చరణ్ రైమ్ ని ఎంతో ఇష్టపడతారు. ఖాళీ సమయాన్ని కూడా ఎక్కువగా రైమ్ తోనే గడుపుతారు. ఈ ఫోటో ద్వారా 'ఆర్ సీ 15' సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: