ఈ ఈవెంట్కు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. సంప్రదాయ పంచ కట్టుకుని విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్-లక్ష్మణ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసే మా జీవితం స్టార్ట్ అయిందన్నారు. ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారన్నారు. అలాగే ఈ సినిమాలో ‘ధర్మం శరణం గచ్ఛామి’ అని ఉంటుందని, ధర్మం పాటించుకుంటూ వెళ్లాలని ఈ సినిమా చెబుతుందన్నారు. సనాతన ధర్మం, నాటు వైద్యం, సత్యం గురించి ఈ సినిమాలో అద్భుతంగా వివరించడం జరుగుతోందన్నారు. ధర్మాన్ని చెప్పగలిగే చిరంజీవితోనే ఈ సినిమా తీయడం జరిగిందన్నారు. రామ్చరణ్ పాత్ర ఎంతో డిఫరెంట్గా ఉంటుందన్నారు. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ఉండబోతుందన్నారు. ఈ సినిమాలో తమకు అవకాశాలు ఇచ్చిన కొరటాల శివకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సినిమాలో చిరంజీవి వయసు 66 కాదని, 16 ఏళ్ల యువకుడిలా నటించారని పేర్కొన్నారు. ఆ తర్వాత భలే భలే బంజారా సాంగ్కి డ్యాన్స్ చేశారు. కాగా, ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి విడుదలై టీజర్, ట్రైలర్ విడుదలై భారీ స్పందన వచ్చిందన్నారు. అలాగే ‘లాహే లాహే, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా’ సాంగ్స్ కూడా బాగున్నాయన్నారు. కాగా, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.