మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని  అందుకున్నాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కథానాయకుడిగా నటించాడు.  ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ తాజాగా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.  ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్  'ఆర్ ఆర్ ఆర్'  సినిమా విడుదల కాకముందే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమా గురించి రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో నేను ఐ పీ ఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను అని,  అలాగే ఈ సినిమాలో ఆ పాత్రకు షార్ట్ టెంపర్ అని రామ్ చరణ్ తెలియ జేశాడు. రామ్ చరణ్  హీరోగా, శంకర్ దర్శకత్వంలో , దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా  సినిమాలో అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోగా నటిస్తుండగా,  ఈ సినిమాలో సునీల్,  అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: