మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఆచార్య’ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటివరకు గెస్ట్ పాత్రలో నటించిన వీరిద్దరూ.. ఫుల్ లెన్త్‌ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించారు. అయితే ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే.. డైరెక్టర్ కొరటాల శివ సినిమాను చిత్రీకరించారు. అయితే ఇప్పటికే విడుదలైన ఆచార్య సినిమా ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.


అలాగే సంగీత దర్శకుడు మణిశర్మ మ్యాజిక్ మరోసారి ఫ్రూవ్ అయింది. ఈ సినిమాకు పాటలు ప్లస్ పాయింట్ అయ్యాయి. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ మంచి హిట్ అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ సక్సెస్‌ఫుల్ హిట్ అందుకున్నారు. దీంతో అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్ అయిన చాలా వరకు సినిమాలు 100 కోట్ల గ్రాస్ మార్క్‌ ను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమాపై పలువురు రివ్యూలు ఇస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


ఈ సందర్భంగా ట్విట్టర్‌లో వెంకీ తిరణాన్ మాట్లాడుతూ..‘ ఇప్పుడే షో కంప్లీట్ అయింది. సినిమా ఫస్ట్ ఆఫ్ యావరేజ్‌గా ఉంది. ఇంటర్‌వెల్ సీన్ అదిరిపోయింది. సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. అలాగే సెకండ్ ఆఫ్‌లో చరణ్ యాక్టింగ్ వేరే లెవల్. మణిశర్మ సంగీతం బాగుంది. ఓవర్‌ఆల్‌గా సినిమా బ్లాక్ బస్టర్.’ అని ఆయన పేర్కొన్నారు.

అలాగే మహి రివ్యూ మాట్లాడుతూ.. ‘చిరంజీవి నటన బాగుంది. సెకండ్ ఆఫ్‌లో రామ్ చరణ్ ఎంతో కష్ట పడ్డారు. సెకండ్ ఆఫ్ మొత్తం రామ్ చరణ్ తన భుజస్కందాలపై నడిపించారు. అలాగే సినిమాలోని అన్ని పాటలు బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా అనిపించినా.. సెకండ్ ఆఫ్ ఇరగదీశారు.’ అని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: