పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చారు. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించగా సాగర్ కె చంద్ర ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక దీని తరువాత ప్రస్తుతం ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
యువ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక పీరియాడికల్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్, వీరమల్లు అనే పవర్ఫుల్ రోల్ చేస్తుండగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు టాక్. ఇటీవల కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో మొదలు కానున్నట్లు టాక్. ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే, రెండున్నరేళ్ల క్రితం ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి సక్సెస్ కొట్టిన నిధి అగర్వాల్ ఈ హరిహర వీరమల్లు మూవీ పై ఎంతో భారీ అంచనాలు పెట్టుకున్నట్లు సమాచారం. సినిమా కథ తనకు ఎంతో బాగా నచ్చడంతో పాటు తనకు ఇష్టమైన పవర్ స్టార్ మూవీ కావడంతో ఆమె ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, అలానే ఇటీవల పలు ఇతర సినిమాల ఛాన్స్ లు వచ్చినప్పటికీ ఈ మూవీతో ఫుల్ బిజీ గా ఉండడంతో ఆమె అవి వదులుకున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే నిధి ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న హరిహర వీరమల్లు ఆమెకు ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.    


మరింత సమాచారం తెలుసుకోండి: