మెగా బ్రదర్ నాగబాబు నటుడు గా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అన్నయ్య చిరంజీవి మరియు తమ్ముడు పవన్ కళ్యాణ్ లో ఇద్దరు స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. ఇక ఈ సమయంలోనే నాగబాబు మాత్రం నటుడిగా చిన్నాచితకా సినిమాలు చేస్తూ బుల్లి తెరపై కనిపిస్తూ తన కెరీర్ ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కువగా ఫుల్ టైం నటుడుగా చేసేందుకు ఆసక్తి చూపడం లేదట. పెద్ద సినిమాలలో లేదా తనకు స్నేహితులైన వారు సినిమాలలోనే చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాగబాబు ఉన్నారు.

అయితే ప్రస్తుతం నాగబాబు నిర్మాణం పైన మళ్లీ దృష్టి పెట్టారు అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాగబాబు నిర్మాతగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ముఖ్యంగా నాగబాబు ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ ను చవి చూసి కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సహాయం చేశాడని ప్రచారం కూడా ఉన్నది. ఎన్నో ఇబ్బందులు పడ్డ నాగబాబు చాలా కాలం తర్వాత నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్ర నిర్మాణంలో కూడా షేర్ ను తీసుకొని.. ఆ సినిమాతో కూడా నిరాశ పడ్డాడు.


ఇక దీంతో మళ్లీ నిర్మాణం వైపు తన అడుగులు వేయలేదు. కానీ  తన సోదరులు మాత్రం డేట్లు అడిగితే నాగబాబుకు  ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు నాగబాబు మాత్రం వీరితో సినిమాలు తీయాలనే ఆలోచనలో లేనట్లుగా సమాచారం.ఇక తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు కనుక ఈయనతో నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు గా సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని కన్ఫామ్ చేశారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఓకే చెప్పడంతో ఇక ఈ కాంబినేషన్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈసారైనా నాగబాబు సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: