ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతో సెన్సేషన్ సృష్టించిందో   ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రాజమౌళి తెరకెక్కించిన సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ నటించిన కొమరం భీమూడో పాత్ర మరో ఎత్తు. ఈ పాత్రలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలు మరో ఎత్తు. ఈ ఒక్క పాటతో ఎన్టీఆర్ తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు ఇక సింగర్ కాలభైరవ ఈ పాటను ఆలకించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా మెప్పించింది. ఇక ఎన్నో రోజుల పాటు ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించిందన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక ఎన్నో రోజుల పాటు ప్రతి ఒక్కరి నోటా కొమరం భీమూడో  పాట వినిపించింది. ఇప్పటికి ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాటను అప్పుడప్పుడు హం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక కొమరం భీమూడో పాట వినిపించగానే ఎందుకో ప్రేక్షకుల మనసు పులకరించి పోతూ ఉంటుంది. పాటలో లీనమై పోతూ ఉంటారు. ఇక ఇలాంటి అద్భుతమైన పాట ఎంతో మంది కమెడియన్స్ స్పూఫ్ చేసి కామెడీ పంచుతూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల జబర్దస్త్ లో కూడా ఇలాంటిదే చేశారు. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్  కు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఈ ప్రోమోలో భాగంగా అటు రాకింగ్ రాకేష్ స్కిట్ సమయంలో కొమరం భీమూడో పాటను కూనీ చేస్తూ మరో లిరిక్స్ రాశారు. రాకింగ్ రాకేషో రాకింగ్ రాకేషో.. ఈరోజు ఎట్లైనా స్కిట్ట్టు కొట్టాలి కొడకో అంటూ లిరిక్స్ రాశారు. అయితే కొంతమంది అభిమానులు ఈ కామెడీ పాటను చూసి ఎంతగానో నవ్వుకుంటే.. మరికొంతమంది మాత్రం నిజమైన పాటను మొత్తం కూని చేశారు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. కమీడియన్స్ అన్న తర్వాత ఇక ఇలాంటి స్పూఫ్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: