సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీస్ తమ తోటి నటులతో ప్రేమలో పడుతుంటారు. కానీ చాలా మంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోగా కొన్ని జంటలు మాత్రమే వారి ప్రేమను పెళ్లి పాటలు వరకు తీసుకెళ్ళి సక్సెస్ అవుతుంటాయి. కాగా ఈ మధ్య కాలంలో ప్రేమ విఫలం కావడం అనేవి చాలా కామన్ అయిపోయాయి. అందులోనూ మన టాలీవుడ్ హీరోస్ లో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ ని ప్రేమించి వివాహం చేసుకున్న వారు ఉన్నారు. అయితే వారి ప్రాంతం, బాషా, మతం వేరే అయినప్పటికీ ఇండస్ట్రీ వారిని కలపడం ప్రేమ వారిని ఒక్కటి చేయడం జరిగాయి. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న ఆ సెలబ్రిటీలు ఎవరో చూద్దామా.

ఈ వరుసలో ముందుంది మన అక్కినేని నాగార్జునే. అక్కినేని నాగేశ్వరరావు వారసుడు నాగార్జున..1992లో హీరోయిన్  అమలను ప్రేమ వివాహం చేసుకుని తన జీవితం లోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరూ కలిసి 1987లో 'కిరాయి దాదా' సినిమా చేయగా ఆ సమయం లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. నటి అమల గారి తండ్రి బెంగాలీ కాగా తల్లి ఐర్లాండ్ కు చెందిన మహిళ. అలా వీరి కులం, మతం, బాష వేర్వేరు అన్నమాట.

మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. బద్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రేణుదేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్. 2009లో వీరి పెళ్లి కొద్ది మంది బంధుమిత్రుల మద్య జరిగింది.   ఈమె పూణే కు చెందిన మహిళ అన్న విషయం తెలిసిందే.  వీరికి అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈమెతో విడాకులు తీసుకున్న తర్వాత  2013 లో రష్యాకు చెందిన నటి అన్నా లేజినోవ ను వివాహం చేసుకున్నారు పవన్. వీరికి కూడా ఇద్దరు సంతానం.

సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం  మహేష్ బాబు వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. నటి నమ్రత ను ప్రేమించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

అదే విధంగా అక్కినేని అక్కినేని నాగచైతన్య  2017 లో సమంతను వివాహం చేసుకున్నారు. సమంత తల్లి మలయాళీ కాగా తండ్రి తెలుగువారు. వీరి కుటుంబం చెన్నైలో సెటిల్ అయింది. పెళ్లి తర్వాత సమంత హైదరాబాద్ లో సెటిల్ కాగా ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: