నిన్నటి రోజున ఎంతో గ్రాండ్ గా విడుదలైన చిత్రం ఏమిటంటే విరాటపర్వం అని చెప్పవచ్చు. ఇందులో హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించారు. అంతేకాకుండా ఇందులో ప్రియమణి కూడా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే ఊపిరికి ఊపిరి మధ్య ఊపిరి ఉన్నంత యుద్ధం.. ఆ యుద్ధం మధ్యలో ఒక చిట్టడవి నట్టనడి రాతిరిలో పుట్టిన వెన్నెల అదే యుద్ధాన్ని నడిపిస్తున్న ఒక అన్న రాసే కవిత్వాలకు మంత్ర ముగ్ధురాలు అవుతుంది. ఇక అడవి బాట పట్టిన వెన్నెల రవన్న మనసు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సినిమాని బాగా ఆకట్టుకుంటాయి.


ఇక ఇందులో వెన్నెల పాత్రలో సాయి పల్లవి ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగోధ్వేవేగమయ్యేలా చేస్తోంది. దీంతో సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎగబడుతున్నరు. 1990వ సంవత్సరంలో సరళ అనే అమ్మాయి తన నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు వేణుఉడుగుల . ఇక ఈ సినిమాని డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ప్రస్తుతం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.


డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ నే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకట్టుకోవడం జరుగుతోంది తాజాగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా ఈ చిత్రం కదిలించింది. తాజాగా విరాటపర్వం సినిమా చూసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈ సినిమా చిత్ర బృందం మెచ్చు కోవడం జరిగింది. మస్ట్ వాచ్ ఫిలిమ్ అంటూ ఒక్క మాట లో రివ్యూ ని ఇచ్చారు. ఇక సాయి పల్లవి అద్భుతంగా నటించింది డైరెక్టర్ వేణు ను మెచ్చుకోవడం జరిగింది రాఘవేంద్రరావు. దీంతో ఈ సినిమా ఒక మెట్టు పై స్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: