రవి
రాజా పినిశెట్టి తనయుడుగా
సినిమా పరిశ్రమలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్నాడు
ఆది పినిశెట్టి. తమిళనా డు లో ఈ
హీరో కి మంచి
మార్కెట్ ఉంది. తెలుగులో కూడా ప్రేక్షకులకు పరిచయం అవడంతో ఇక్కడ కూడా నటుడుగా నిలదొక్కుకొని మంచి
సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. ఆ విధంగా ఒక
హీరో పాత్రలే అని కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఇక్కడ మంచి నటుడిగా ఎదిగాడు ఆది. అంతే కాదు విలన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తరికెక్కిన సరైనోడు సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిం చిన
ఆది పినిశెట్టి ఇప్పుడు మరొకసారి విలన్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
బోయపాటి శ్రీను సినిమాలలో విలన్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోతో పాటు ఢీ అంటే ఢీ అని ఢీకొట్టే పాత్రలో విలన్ పాత్రను ఆయన డిజైన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా సరైనోడు సినిమాలో
ధనుష్ పాత్రను చేసి దానికి వందకు వందశాతం న్యాయం చేకూర్చిగాడు ఈ నటుడు.
ప్రస్తుతం
రామ్ హీరోగా నటిస్తున్న ది
వారియర్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరొకసారి పవర్ఫుల్ పాత్రలో ఆయన నటించబోతున్నాడు అని చెప్పుకుంటున్నారు. సరైనోడు సినిమాలో ఆయన నటించిన తీరుకు భారీ స్థాయిలో పేదో ప్రఖ్యాతలు రాలేదని చెప్పాలి. అంతగా పాపులర్ అవ్వలేదని చెప్పాలి. దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ
సినిమా అయినా తనకు ఇలాంటి మరిన్ని పాత్రలను తెచ్చిపెడుతుందా అనేది చూడాలి. ఈ వారమే ఈ సినిమాకు సంబంధించిన విడుదల జరగబోతుంది. కృతి శెట్టి
హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా కి
తమిళ దర్శకుడు లింగస్వామి విలన్ గా నటించబోతున్నారు.