దర్శకుడు
విక్రమ్ కుమార్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. విభిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తూ స్క్రీన్ ప్లే విషయంలో ఎంతో వెరైటీ కొత్త దనాన్ని ప్రదర్శిస్తూ ఉంటూ ఆయన సినిమాలను చేస్తూ ఉంటారు. అందుకే ఆయన కెరియర్ ఎంతో సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుంది. స్క్రిప్టుపై గట్టిగా కసరత్తు చేసి అక్కడే సగం విజయాన్ని సాధించి ప్రేక్షకులను తన మాయాజాలంతో కట్టిపడిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రెండుకు అప్డేట్ అవుతూ
జోనర్ లను మారుస్తూ వెళుతూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.
తెలుగులో
గ్యాంగ్ లీడర్ సినిమాతో సరికొత్త పాయింటును టచ్ చేసిన ఆయన ఇప్పుడు థాంక్యూ అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
నాగచైతన్య హీరోగా నటించిన ఈ
సినిమా 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
విక్రమ్ కుమార్ ఈ
సినిమా గురించి మాట్లాడుతూ తాను గతంలో రూపొందించిన 24వ
సినిమా గురించి కూడా చెప్పాడు.
చాలా రోజుల నుంచి 24 సినిమాకు సీక్వెల్ గురించిన వార్తలు వస్తూ ఉండగా దీనిపై ఆయన స్పందించడం
సూర్య అభిమానులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. 24
సినిమా అంటే చాలా ఇష్టం. ఆ తరహా సినిమాలో అంతకుముందు ఎక్కడ రాలేదు. పాత్రల లుక్ డిఫరెంట్ గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాము అయితే చివరికి అనుకున్న ఫలితం రాకపోయినా కూడా ఈ
సినిమా తనను సంతృప్తి పరిచిన
సినిమా అని ఆయన చెప్పారు.
థియేటర్ లలో కాస్త అటు ఇటు అయినా కూడా ఈ చిత్రాన్ని టీవీలలో చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు. సోషల్
మీడియా ద్వారా చాలామంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో తాను ఉన్నట్లుగా ఆయన చెప్పారు.
సూర్య లో కూడా దీనికి సీక్వెల్ చేసే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ పనులలో ఉన్న
విక్రమ్ కుమార్ ఆ తర్వాత
బాలీవుడ్ లో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. మరి చాలామంది ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఏంటి అని 24 సినిమాపై సెటైర్లు కూడా వేస్తున్నారు.