తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ఎన్నడూ లేనివిదంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మానఅందరికి తెలిసిందే. ఇక ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన #RRR సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ క్రేజ్ మరింత పెరగడం జరిగింది. అయితే ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక రామ్ చరణ్ మరియు కీయార తో పాటుగా ఈ సినిమాలో శ్రీకాంత్‌, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్‌, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు.ఇదిలా ఉంచితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా రామ్ చరణ్‌కు ఇది 15వ చిత్రం కావడంతో.. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాదే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజ్ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుంది. అయితే ఆ సాంగ్ కోసం శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను రంగంలోకి దింపబోతున్నారట. ఇక ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. ఆమె `ఆర్సీ 15`లో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.ఇకపోతే  కిచ్చా సుదీప్ హీరోగా రూపుదిద్దుకున్న `విక్రాంత్ రోనా` అనే తమిళ సినిమాలో `రా రా రక్కమ్మా` అంటూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఏ రేంజ్‌లో ఊపేసిందో తెలిసిందే. అయితే  ఇక ఇప్పుడెమో చరణ్‌తో చిందులు ఏసేందుకు సిద్ధమవుతోందంటూ ప్రచారం జరుగుతోంది.  చూడాలి మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో కాదో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: