ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు పట్టిందల్లా బంగారమే. ఆయన బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు అది ఖచ్చితంగా మినిమమ్ గ్యారంటీ హిట్. కానీ అలాంటిది ఇప్పుడు దిల్ రాజుకు వరుసగా కష్టాలు అనేవి వచ్చిపడుతున్నాయి.టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ మూవీ దిల్ రాజుకు ఇప్పుడు భారీ షాక్ ఇచ్చింది. రీసెంట్ గా హిందీ ప్రొడక్షన్స్ లో జెర్సీ ఇంకా హిట్ సినిమాలను అందించారు. కానీ ఆ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక వాటి ఫెయిల్యూర్స్ నుంచి నుంచి తేరుకోకముందే తాజాగా దిల్ రాజుకి మరో షాక్ తగిలింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన "థ్యాంక్యూ" సినిమా నాగ చైతన్య కెరీర్‌లో అతి తక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం ఏపీ ఇంకా తెలంగాణల నుంచి కేవలం రూ.1.50 కోట్ల షేర్ రాబట్టింది.


మొత్తం సెడెడ్ ప్రాంతం కేవలం రూ. 20 లక్షలు మాత్రమే ఈ సినిమా వసూళ్లను రాబట్టింది.ఇంకా విచిత్రమేమిటంటే, దిల్ రాజు విడుదలకు ఒక రోజు ముందు ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు సెంటర్‌లలో పెయిడ్ ప్రివ్యూలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ హైదరాబాద్‌లో మాత్రం అలాంటి ప్రయత్నమేమి చేయలేదు. ఈ పెయిడ్ ప్రివ్యూలు మంచి బజ్‌ని సృష్టించడంలో సహాయపడతాయని చిత్ర బృందం భావించిందని వర్గాలు చెబుతున్నాయి. కానీ అది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి నుంచే నెగిటివ్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఇలాంటి సిల్లీ ఐడియాలు ఇచ్చిన టీమ్‌ని దిల్ రాజు మందలించిన కూడా తప్పు లేదు. f3 సినిమాతో నష్టపోయిన దిల్ రాజుకి మళ్ళీ ఇలా థాంక్ యూ రూపంలో మరో షాక్ తగలడం నిజంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: