బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ ఇప్పుడు మరొకసారి కరోనా బారిన పడ్డారు. ఇక ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ కరోనా నిర్ధారణ పరీక్షలలో తనకు పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు తన చుట్టూ వారు అలాగే పరిచయం ఉన్న ఎవరైనా సరే దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు అమితాబ్ బచ్చన్. ఇకపోతే అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం బుల్లితెర క్విజ్ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ షూటింగ్స్ సందర్భంగా ఆయన పలువురు వ్యక్తులను కలుసుకోవడం జరిగింది. కరోనా ఆంక్షలు, నిబంధనల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ కు ప్రేక్షకులు లేకుండానే పూర్తి చేశారు.  అయితే ఈ  ఏడాది మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే షో ను నిర్వహిస్తున్నారు

అయితే కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది అనే విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం. ఇదివరకే 2021 జూలై 11వ తేదీన కరోనా కారణంగా అమితాబ్ బచ్చన్ ముంబైలోని విలేపార్లే లో నానావతి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక అప్పుడు అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్,  ఆరాధ్య కూడా కరోనా కోరలకు చిక్కారు.ఇక కొన్ని రోజులపాటు అమితాబ్ బచ్చన్, అభిషేక్ కూడా అక్కడే నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరిగింది. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడ 24 గంటల వ్యవధిలో  25 శాతం కరోనా కేసులు పెరిగాయి.

ప్రస్తుతం ముంబై నగరంలో 12 వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు సూచించారు. ఇక ఏ విధమైన కరోనా మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తం అవ్వాలని కూడా బిగ్ బీ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: