సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ SSMB -28 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా కొన్ని నెలల క్రితమే మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుపుకుంటున్నాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగానే చెబుతున్నట్లుగా ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ రెండో వారంలో మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



తాజాగా మహేష్ బాబు అభిమానులకు సంబంధించి మహేష్ బాబు భార్య నమ్రత ఒక స్పెషల్ అప్డేట్ ని ఇవ్వడం జరిగింది. SSMB -28 సినిమాకు సంబంధించి సెట్లో నుంచి ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. తాజా ఫోటోలు మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాస్త రఫ్ అండ్ మాస్ లుక్కులో చాలా సీరియస్ గా చూస్తున్నటువంటి ఒక చార్మింగ్ లుక్కులో మహేష్ బాబు కనిపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. హైదరాబాదులోని ఆర్ఎఫ్సి లో యాక్షన్ ఎపిసోడ్ తో ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన సభ్యులకు కూడా సెట్లో చేరనున్నారు ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్నది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం సమంత తన ఇంస్టాగ్రామ్ నుంచి ఈ ఫోటో షేర్ చేయడంతో చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు ఆ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: