టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ మొదట్లో మంచి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు హిట్ కోసం ఆయన తెగ కష్టపడిపోతున్నాడు. తను చివరిగా నటించిన లైగర్ చిత్రం చాలా దారుణంగా ఫ్లాప్ అయింది.ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక ఆ సినిమా పరాజయం తర్వాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గోంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23, 2022న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ సమంత నెగ్లిజెన్స్ వలన ప్రాజెక్ట్ లేట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకి టాలీవుడ్ నుండే కాక బాలీవుడ్ నుండి కూడా వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు వరస ఒప్పేసుకుంటోంది.


ఆమె వల్ల తమ ప్రాజెక్టు డిలే అవుతోందని గోలెత్తిపోతున్నట్లు సమాచారం. వాస్తవానికి అక్టోబర్ రెండవ వారం నుంచి ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉమంది. కానీ సమంత డేట్స్ ఇంకా దొరక్క ఆగారని సమాచారం తెలుస్తోంది.ఆమె కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తో తీయాల్సిన సీన్స్ ఆలస్యం అవుతున్నాయి.నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణకి నానితో తీసిన టక్ జగదీష్ మాత్రం ఫ్లాపయి షాకిచ్చింది. దాంతో ఇప్పుడు ఖుషి సినిమా మీదే నమ్మకాలన్నీ పెట్టుకున్నాడు. లైగర్ తో విజయ్‌కి కూడా ఫ్లాప్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెద్దగా లేవు. ఇక సమంతకు కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న శాకుంతలం వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.ఇంకా అలాగే, యశోద కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. వాస్తవంగా ఆగస్టు 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: