బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది దీపికా పదుకొనే. గత కొన్ని రోజులుగా ఆమే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది అంటూ పలు వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. పప్రాజెక్ట్ -k సినిమా షూటింగ్ సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడంతో ఆమెను వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం. అయితే ఇటీవల ముంబైలో కూడా ఆమె ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. ఆ తర్వాత తాజాగా ఇంటర్వ్యూలు పాల్గొన్నా దీపిక పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.


దీపిక మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని.. తన తల్లిదండ్రులతో దూరంగా ఉంటున్న సమయంలో తన మానసిక స్థితి చాలా దారుణంగా ఉండేదని. వారు తన వద్దకు అప్పుడప్పుడు వచ్చిన సమయంలో నేను వారిని చాలా నార్మల్గా కనిపించేందుకు ఎంతో ప్రయత్నించేదాన్ని తెలిపింది. ఒకానొక సమయంలో తన తల్లితండ్రులు నిలదీశారట.ఇలా ఎందుకు ఉంటుందో ఏం జరిగింది అనే విషయాన్ని అడుగుతూ ఉండేదట. ఆ సమయంలో తన మానసిక పరిస్థితి గురించి తన డిప్రెషన్ గురించి ఆమెకు చెప్పడంతో తన తల్లి సహకారంతోనే ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చాను అని తెలియజేసింది దీపిక. ఆ సమయంలో తన తల్లి తనకు మద్దతుగా నిలిచి ఉండకపోతే నేను ఈరోజు ఇలా ఉంటే దాన్ని కాదంటూ కామెంట్లు చేయడం జరిగింది.


ఇక డిప్రెషన్ ఉన్న సమయంలో తప్పకుండా తన కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకుంటానని వారి యొక్క సహకారం తీసుకోవడం చాలా మంచిదని తెలియజేసింది దీపికా పడుకొనే. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే అలాంటి సమయంలో అందరినీ అర్థం చేసుకునేదని దీపిక తన అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ ముద్దుగుమ్మ రణవీర్ సింగ్ ను వివాహం చేసుకొని తన జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతోంది గడిచిన కొన్ని రోజులకు పలుమార్సి వస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: