న టసింహ నందమూరి బాలకృష్ణ  మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీఈ సినిమా టైటిల్‌ ఇదంటూ.. అనేకానేక పేర్లు సోషల్ మీడియా వైరల్ అవుతున్న నేపధ్యంలో.. ఇక ఆలస్యం చేయకూడదని భావించిన టీమ్.. దీపావళి స్పెషల్‌గా సినిమా టైటిల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు కూడా. మేకర్స్ నుంచి ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో.. అప్పటి నుంచి నందమూరి అభిమానులు ఎంతగానో ఈ సినిమా టైటిల్ కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మాస్ లుక్, ఫస్ట్ హంట్ వీడియో.. బీభత్సమైన అంచనాలను క్రియేట్ చేయగా.. ఇక టైటిల్ కూడా వస్తే.. ట్రెండ్ సెట్టర్ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి టైమ్‌లో ఈ సినిమా టైటిల్ లీకయిందంటూ సినీ సర్కిల్స్‌లో వినబడుతోంది. ఇక ఈ లీకయిదంటూ చెప్పుకుంటున్న టైటిల్వింటే.. నందమూరి అభిమానులకు పండగే. ఇంతకీ ఆ లీకైన టైటిల్ ఏమిటనుకుంటున్నారు.. 'వీరసింహా రెడ్డి'  నిజంగా ఇదే టైటిలా? లేదంటే ఇంతకుముందు పుట్టుకు వచ్చినటువంటిదేనా? అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 21 వరకు వెయిట్ చేయకతప్పదు. టైటిల్‌ను ఈ నెల 21న ఐకానిక్ ప్లేస్‌ కర్నూల్‌లోని కొండా రెడ్డి బురుజు  వద్ద విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు.
అక్టోబర్ 21, సాయంత్రం 8:15 సమయంలో టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు. విశేషం ఏమిటంటే.. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా ఇటువంటి వేడుక జరుపుకుంటున్న చిత్రం 107నే కావడం. ఈ వేడుక కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా,నవీన్ నూలి ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. బాలయ్య సరసన శృతిహాసన్  హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: