కళ్యాణ్ రామ్ కెరియర్ లో భారీ విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది బింబి సారా. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన సినిమాకు ఇప్పటి కాలానికి లింకు పెట్టడం అది సినిమాలో కీలక మలుపు తిరగడం ఈ చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఫైనల్ గా ఈ సినిమా ఈ ఏడాది భారీ స్థాయిలో విజయాలను అందుకున్న హిట్ జాబితాలో చేరిపోయింది. కళ్యాణ్ రామ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూసిన భారీ విజయం కూడా ఈ సినిమాతో దక్కినట్లు అయ్యింది.

సినిమా ద్వారా వశిష్ట అనే ఓ నూతన దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ గా పరిచయం కాగా ఈ చిత్రం వారిలో ఎంతో సంతోషాన్ని నింపింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి రెండో భాగం కూడా ఉంది అని చెప్పి అందరిలో కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తించారు. దాంతో అభిమానులు అందరూ కూడా ఈ సినిమా యొక్క రెండవ భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పుడు చూద్దామా అన్నట్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే తాజాగా ఈ సినిమా యొక్క దర్శకుడు వశిష్ట రజనీకాంత్ కు కథ చెప్పాడు అన్న వార్తలు బయటకు రావడం నిజంగా ఒక్కసారిగా వీరిని ఎంతగానో షాక్ కి గురి చేశాయని చెప్పవచ్చు. ఒకవేళ రజినీకాంత్ ఆ కథను మెచ్చి సినిమా వెంటనే చేయమంటే వశిష్ట వెంటనే రజినీకాంత్ సినిమాను మొదలుపెడతాడు. కాబట్టి ఈ షాక్ లో వారు ఉండడానికి కారణం అవుతుంది. వెంటనే ఈ రెండో భాగం సినిమా చేస్తారని భావించిన వశిష్ట ఈ విధంగా ఇంకొక హీరోతో సినిమా ఓకే అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు చూస్తారో అన్న నిరాశ రోజురోజుకు ప్రతి ఒక్కరిలో ఎక్కువ అవుతుంది. త్వరలోనే ఈ దర్శకుడు ఆ సినిమాపై ఓ క్లారిటీ ఇస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: